వ్యక్తి అదృశ్యం

నవతెలంగాణ- కంటేశ్వర్
నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ బుధవారం తెలిపారు. మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..కంటేశ్వర్ , నిజామాబాద్ కు చెందిన తమ్మి రాహుల్, వయస్సు 33సం. అను అతను తన ఇంటి నుండి తేదీ 04.06.2023 నాడు ఉదయం 9.30 గంటలకి తన ఇంట్లో నుండి వెళ్లి తిరిగి ఇంటికి రానందున తన తండ్రి తమ్మీ పరమేశ్వర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి పిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ ఫోటో లోని వ్యక్తి వివరాలు గురించి తెలిసినచో, అట్టి సమాచారాన్ని టౌన్-3 పోలీస్ స్టేషన్, నిజామాబాద్ ఎస్సై ఫోన్ నం.8712659839 లేదా 08462220350 కు తెలుపగలరు అని ప్రజలకు తెలియజేశారు.

Spread the love