– మరో ఉద్యోగిపై విచారణకు ఆదేశాలు
– సూపర్వైజర్పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని లేఖ
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : అక్టోబర్ 14వ తేదిన భువనగిరి బాలసదన్లో జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో విధుల నిర్వహణపై నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలో ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్వర్వులను జారీ చేసినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి నర్సింహారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వుల ప్రతులను ఉద్యోగులు బాలల పరిరక్షణాధికారి పి. సైదులు, బాలసదన్ పర్యవేక్షణాధికారి లలితకు అందజే శారు. జిల్లా కేంద్రంలోని బాలనదన్లో గత నెల 14న జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఔట్సోర్సింగ్ ఉద్యోగి వెంకట్రెడ్డి ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు బాలల పరిరక్షణాధికారికి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి స్వచ్చంధ సంస్థలు అధికారుల దృష్టికి తీసుకు రావడంతో సంబంధిత అధికారులు విచారణ జరిపి అలస్యంగా 20న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోక్సో కేసు నమోదు రిమాండ్కు పంపించారు. ఈ విషయమై కలెక్టర్ విచారణ జరిపించి ఉద్యోగుల తప్పిదాన్ని గుర్తించి ఇరువురిని విధులనుంచి తొలగించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ ఉద్యోగి పీవోఐసీ అలివేలు పాత్రపై మరోసారి విచారించాలని ఆర్డీవో కృష్ణారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. అలాగే బాల సదనం సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న ఐసీడీఎస్ రెగ్యులర్ మహాలక్ష్మిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని స్త్రీ శిశు సంఓఏమ శాఖు కలెక్టర్ లేఖ వ్రాసారు. కాగా విధులపై నిర్లక్ష్యం చేసిన ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయటాన్ని స్వాగతిస్తున్నామని మాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకుడు కొడారి వెంకటేశ్, నేషనల్ హ్యుమన్రైట్స్ కమిషన్ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. బాలల రక్షణ, సంరక్షణలో అధికారులు నిర్లక్ష్య ధోరణికి ఈ చర్య గుణపాఠం కావాలన్నారు.