– ఎస్ ఐ ఏ కమలాకర్ పసర పోలీస్ స్టేషన్
నవతెలంగాణ-గోవిందరావుపేట
అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ కమలాకర్ అన్నారు. శనివారం స్టేషన్ సిబ్బందితో కలిసి పసర పరిధిలోని దేవుని గుట్ట గుత్తి గూడెం ను ఎస్ ఐ కమలాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ గూడెం గిరిజనులతో మాట్లాడారు. అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించకుడదని ఎవరైనా కొత్త వ్యక్తులు తమ గ్రామం కు వస్తే తమకు సమాచారం అందించాలని తెలియచేసారు.చట్ట వ్యతిరేక మైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అంతే కాకుండా అక్కడి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న వానాకాలం దృశ్య వరదలు సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించటం జరిగింది. తరచూ గూడెం ను సందర్శిస్తానని సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురావాలని పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు