ఆందోళన వద్దు… ఇక నుంచి అక్కడ దరఖాస్తులు ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddyనవతెలంగాణ – హైదరాబాద్
ప్రజాపాలన – అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ నిన్నటితో(జనవరి 6)  ముగిసిందని… కానీ అర్హులు ఎలాంటి ఆందోళన చెందవద్దని… ఇప్పటి వరకు అధికారులు ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులు స్వీకరించారని.. ఇప్పుడు ప్రజలు కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు ఇవ్వవచ్చునని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన ముగిసినప్పటికీ ప్రజలు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ‘ఇప్పటి వరకు ప్రజాపాలన పేరుతో అధికారులను మీ వద్దకు పంపించాం.. కానీ ఆందోళన చెందవద్దు.. ఇక నుంచి మీరు కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు ఇవ్వవచ్చు’ అని తెలిపారు. అర్హులైన వారు ఇకపైనా దరఖాస్తులు చేసుకోవచ్చునని హామీ ఇచ్చారు. వంద రోజుల్లో తాము ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు.

Spread the love