నవతెలంగాణ – హైదరాబాద్: ఈ ఏడాది అద్భుత ఫామ్లో ఉన్న భారత స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగే భారత్ తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చన్న అనుమానాలు బలపడతున్నాయి. శుభ్మన్ గిల్ డెంగ్యూ బారినపడ్డట్టు గురువారం వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. నేడు అతడికి మరో దఫా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రిపోర్టుల అధారంగా శుభ్మన్ గిల్ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్లో ఆడేదీ లేనిదీ నిర్ణయిస్తామని టీం మేనేజ్మెంట్ తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 8న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ సమయానికి గిల్ ఆరోగ్యం మెరుగుపడకపోతే కేఎల్ రాహుల్ లేదా ఇషాన్ కిషన్ ఓపెనర్గా దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2019 నాటి ప్రపంచకప్లో కేఎల్ రాహుల్ భారత్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. అప్పట్లో గాయం కారణంగా శిఖర్ ధవన్ అందుబాటులో లేకపోవడంతో రాహుల్ను దించాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో రోహిత్ అందుబాటులో లేని పలు మ్యాచ్ల్లో ఇషాన్ ఓపెనర్గా వచ్చాడు.