నవతెలంగాణ – హర్యానా
హర్యానాలోని పానిపట్ జిల్లాలోని ఓ పోలీసు ఉన్నతాధికారి జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. పానిపట్ జిల్లా జైల్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న జోగిందర్ దేశ్వాల్.. సోమవారం ఉదయం జిమ్లో వర్కవుట్స్ చేస్తున్నారు. జిమ్ చేస్తూనే, ఉన్నట్టుండి ఆయన కుప్పకూలిపోయారు. దీంతో పోలీసు ఆఫీసర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జోగిందర్ దేశ్వాల్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. జోగిందర్ మృతితో హర్యానా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల పోలీసు శాఖ, జైలు సిబ్బంది నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.