నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లోని పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామునే బృందాలుగా విడిపోయి ఐటీ కార్యాలయం నుంచి బయలుదేరిన అధికారులు.. పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. కూకట్పల్లిలోని హిందూ ఫార్చ్యూన్లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. వ్యాపార లావాదేవీల్లో ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి ఈ సోదాలు చేస్తున్నారు.