నవతెలంగాణ-చివ్వెంల: మండల పరిధిలోని వల్లభాపురం గ్రామంలో ఆదివారం వల్లభాపురం యువజన సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది . యువజన సంఘo గ్రామ అధ్యక్షులుగా గోనెల శివకుమార్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యూత్ అధ్యక్షుడు గోనెల శివకుమార్ మాట్లాడుతూ వల్లభాపురం గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని, గ్రామ అభివృద్ధిలో యువత ముందుండాలని కోరారు . యూత్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి సహకరించిన యూత్ సభ్యులకి, గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ ఉపాధ్యక్షులు కుంభం సతీష్, కార్యదర్శి గుండు నరసయ్య, కోశాధికారి ఊరడి రామరాజు, యూత్ సభ్యులు జీడిమెట్ల అరవిందు, ఎస్.కె పాషా, మోగదాల వినోద్, మల్లెబోయిన వీరస్వామి, యాట సాయి సింగారపు మహేష్ సింగారపు రాజేష్ పప్పుల ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.