టీయూఎన్ టీఈఎ కార్యవర్గం ఎన్నిక..

-టీయూ నుండి నాలుగురికి చోటు..
నవతెలంగాణ-డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలంగాణ యూనివర్సిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు సాయ గౌడ్ మంగళవారం తెలిపారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ రాంరెడ్డి డిస్టన్స్ ఎడ్యుకేషన్ హాల్ లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 14 యూనివర్సిటీలకు చెందిన బోధనేతర సిబ్బంది ఎన్నికల్లో పాల్గొని రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు దీనిలో తెలంగాణ యూనివర్సిటీ నుండి నలుగురికి చోటు లభించిందని సాయగౌడ్ వివారించారు. బి. సాయాగౌడ్ టీయూలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా, బి భాస్కర్ సూపరింటెండెంట్ టీయూకు, వైస్ ప్రెసిడెంట్ గా, బి. విజయలక్ష్మి అసిస్టెంట్ రిజిస్ట్రార్, టీయూ కు జాయింట్ సెక్రెటరిగా, ఎస్. జ్యోతి సూపరింటెండెంట్ టీయూకు ఉమెన్ సెక్రెటరీ గా పదవులు దక్కినయని అయిన వివరించారు.ఈ పదవులను ఇచ్చినందుకు గాను తెలంగాణ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్స్ (టీయూఎన్ టీఈఎ) రాష్ట్ర కార్యవర్గానికి తెలంగాణ యూనివర్సిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో ఉన్న యూనివర్సిటీ ల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని బోధనేతర సిబ్బంది తెలిపారు. ఈ పదవీ కాలం మూడు ఏళ్ల పాటు కొనసాగుతుందని అధ్యక్షులు బి సాయాగౌడ్ తెలిపారు.

Spread the love