నవతెలంగాణ-న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్ తొలి విజయం సాధించింది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఘోరం పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ మంగళవారం ధర్మశాలలో బంగ్లాదేశ్తో జరిగిన రెండో మ్యాచ్లో భారీ విజయం నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేయగా.. 365 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 137 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ లిటన్ దాస్ మినహా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.