అనాది కాలంలో అన్ని దేశాల్లో మానవుని జీవనాధారం వ్యవసాయం. కాలక్రమేణా మానవుని మేధస్సు వద్ధి చెందుతూ అనేక అవసరాలు, సౌకర్యాలు ఏర్పాటు చేసుకొంటున్నారు. దీనిలో భాగంగానే అనేక వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టారు. పారిశ్రామికీకరణ ఊపు అందుకుంది. ఆదాయం పెరిగి, వలసలు ప్రారంభమయ్యాయి. విలాస జీవితాలు అనుభవిస్తూ భూలోకాన్నే స్వర్గధామం చేస్తున్న పరిస్థితి నెలకొంది. 17వ శతాబ్దం నుండి ప్రారంభమైన వివిధ రంగాల అభివద్ధి, నేడు 21వ శతాబ్దంలో సాఫ్ట్వేర్ రంగం పురోభివద్ధితో అత్యున్నత స్థాయికి చేరుతోంది. దీనికి ప్రధాన కారణం చదువులో అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవడం.
పొట్ట పోషణకు సంబంధించిన సిలబస్ మాత్రమే అభ్యసించే పరిస్థితి నుండి అనేక అద్భుతాలు, ఆవిష్కరణలు చేయడమే ప్రధాన ధ్యేయంగా నూతన సిలబస్ ప్రవేశిస్తోంది. దీనికి తోడు ప్రతీ రంగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో అన్ని రంగాలు రోజు రోజుకు నూతన ఒరవడులు సంతరించుకుంటున్నాయి. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఎ.ఐ) వంటి చదువులు వచ్చాయి. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథ్స్ (స్టెమ్) అని పేరుతో విద్యా విధానం విలసిల్లుతోంది.
గ్లోబలైజేషన్ పేరుతో ప్రపంచం అంతా కుగ్రామంగా మారింది. ప్రతి పనీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడింది. కంప్యూటర్, లాప్ టాప్, టాబ్లెట్, రాడార్ వ్యవస్థ వంటి వాటితో అనుసంధానమైంది. ప్రతీ విషయం డిజిటలైజేషన్ అయింది. వి.ఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్, ఇమేజ్ మిర్రరింగ్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రేలియా వంటి దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో, సాఫ్ట్వేర్ రంగంలో అగ్రభాగాన నిలుస్తున్నాయంటే కారణం వారి విద్యా విధానంలో అనేక నూతన సిలబస్తో పాటు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని రూపొందించి, నైపుణ్యాల అభివద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రపంచ స్థాయిలో ఉత్తమ విశ్వవిద్యాలయాలు ఈ దేశాల్లో ఉండడంతో మిగిలిన దేశాల విద్యార్థులు ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో వలస వెళ్తున్నారు. దీనికి భిన్నంగా మనదేశంలో విద్యారంగం కునారిల్లుతున్నది. దేశవ్యాప్తంగా ఏ కళాశాల, విశ్వవిద్యాలయం చూసినా అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాలు, లేబరేటరీలు, గ్రంథాలయాలు లేకపోవడం వలన నాసిరకం ప్రమాణాలతో విద్యార్థులు ఉత్తీర్ణత పట్టాలు పట్టుకుని బయటకు వస్తున్నారు. నైపుణ్యాలు లేక నిరుద్యోగంతో మగ్గిపోతున్న దుస్థితి నేడున్నది. నిధులు లేక ప్రభుత్వ విద్యారంగం వెనకబడుతుంటే, కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు పెరుగుతూ ధనికులకు మాత్రమే నాణ్యమైన విద్య అందుబాటులోవుంది. దీంతో దేశవ్యాప్తంగా అనేక లక్షల మంది విద్యార్థులకు సరైన ప్రమాణాలు నైపుణ్యాలు లేని విద్యతో వెనుకబడుతున్నారు. దీంతో నేటి యువత ప్రపంచ పోటీలో నిలువలేక ఉద్యోగ లేమితో బాధపడుతున్నారు. నైపుణ్యాలు లేక పోవడంతో అసంఘటిత రంగంలో కార్మికులుగా, తక్కువ జీతంతో పనివారిగా మారుతున్న పరిస్థితి. కువైట్, యు.ఏ.ఈ, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలకు అతి తక్కువ వేతనాలకు సమ్మతించి వలస బాట పట్టారు. భవన నిర్మాణ కార్మికులుగా, సేవలు అందించే వారిగా, చివరికి యుద్ధాల్లో పాల్గొనే సైన్యంగా మారుతున్నారు.
ఇకనైనా ఈ పరిస్థితిని పాలకులు మార్చాలి. ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది యువత ఉన్న మనదేశంలో సరైన విద్యా సౌకర్యాలు లేక వెలవెల బోతోంది. విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి. ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ‘స్కిల్ డెవలప్మెంట్’ కు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ఆధునిక కాలానికి అనుగుణంగా విద్యా విధానాన్ని రూపొందించి అమలు చేయాలి. చిన్న చిన్న సౌకర్యాలతోనే మనవాళ్ళు ఎన్ని అద్భుతాలు, ఆవిష్కరణలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అదే అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ప్రపంచ దేశాల సరసన అనేక రంగాల్లో మనదేశాన్ని ముందు వరుసలో నిలబెడతారని గ్రహించాలి. విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ల నియామకాలు చేపట్టాలి. అనుభవం, మేధస్సు గలవారిని నియమించాలి. కుల, మత, ఛాందస భావాలకు చరమగీతం పాడాలి. పారిశ్రామికీకరణ, సాఫ్ట్వేర్ రంగాన్ని పరుగు పెట్టించే చర్యలు తీసుకోవాలి. నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఒరవడులు సష్టించాలి. నిరుద్యోగాన్ని పారదోలాలి. యువత మేధస్సు, నైపుణ్యాలతో నూతన ఆవిష్కరణలు చేస్తూ, ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించాలి. తలసరి ఆదాయం పెంచుకుంటూ జాతీయ ఆదాయం పెంచాలి. జిడిపి వద్ధి రేటు పెరగడానికి యువతలో నైపుణ్యాలు పెంచుట ద్వారానే సాధ్యం అని గ్రహించాలి. అభివద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించాలంటే, విద్యా రంగాన్ని ప్రభుత్వం రంగంలో కొనసాగిస్తూ, అధిక నిధులు సమకూర్చి ప్రమాణాలు నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయుటయే రాబోయే 2047 సెంచున్యరీ స్వాతంత్య్రం దినోత్సవ వేడుకలకు మనం దేశానికి ఇచ్చే పెద్ద బహుమతి అని అందరూ గ్రహించాలి… గుర్తించాలి. అప్పుడు మాత్రమే ‘వికసిత భారత్’ సాధ్యం.
– ఐ.ప్రసాదరావు,
6305682733