ఎర్రగడ్డ కార్పొరేటర్‌ మృతి

ఎర్రగడ్డ కార్పొరేటర్‌ మృతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షాహీన్‌ బేగం
నవతెలంగాణ-జూబ్లీహిల్స్‌
హైదరాబాద్‌ ఎర్రగడ్డ డివిజన్‌కు చెందిన ఏఐఎంఐఎం కార్పొరేటర్‌ షాహీన్‌ బేగం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతిచెందారు. షాహీన్‌ బేగం 2020లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. కొన్ని రోజుల కిందట ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతిచెందారు. ఆమె కుటుంబానికి ఏఐఎంఐఎం పార్టీ సీనియర్‌ నేతలు సంతాపం తెలిపారు. మృతురాలి భర్త, మాజీ కార్పొరేటర్‌ మహమ్మద్‌ షరీఫ్‌ ఖురేషి కూడా 2023 అక్టోబర్‌లో అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఎర్రగడ్డ డివిజన్‌లో ప్రస్తుత కార్పొరేటర్‌, మాజీ కార్పొరేటర్‌ ఇద్దరూ ఏడు నెలల వ్యవధిలోనే చనిపోవడం ఎంఐఎంకు తీరని లోటని నాయకులు, కార్యకర్తలు విచారం వ్యక్తం చేశారు.

Spread the love