– మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధులతో సమీక్ష
– ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా రూ.1040 కోట్ల ఖర్చు : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మహారాష్ట్ర-తెలంగాణ మధ్య నున్న లెండి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక దష్టి సారించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం మహారాష్ట్ర నాందేడ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ రవీంద్రచవాన్, మాజీ ఎమ్మెల్యే హనుమంత్రావు పాటిల్, సురేష్ పండిత్ వార్, సుభాష్బాద్, వాకిడిష్వార్, దినేష్ అవాజ్, సందీప్ పాటిల్ తదితర మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధుల బందం రాష్ట్ర సచివాల యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా లెండి భారీ ప్రాజెక్ట్ పూర్తి చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ 1984 ప్రాంతంలో రూ.2183.88 కోట్ల అంచనా వ్యయంతో మహా రాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా వద్ద ప్రారంభించిన లెండి ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణలో 38573.15 ఎకరాలు, మహారాష్ట్రలో 27710.397 ఎకరాలు సేద్యంలోకి వస్తుందన్నారు. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల ఒప్పందం ప్రకారం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్పై రూ.1040.87 కోట్లు ఖర్చు చేశాయని చెప్పారు. దీంతో ఎర్తేన్ డ్యామ్ వర్క్ 70శాతం, స్పిల్ వే 80శాతం పూర్తిచేసినట్టు వివరిం చారు. కాలువల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు. భూ అంతర్భాగం నుంచి పైపుల ద్వారా నీటిసరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. అయితే కాలక్రమంలో భూనిర్వాసితులు అడ్డుపడడంతో 2011లో అర్ధాం తరంగా నిలిపివే యబడిన పనులను తిరిగి పున రుద్ధరించి నట్టు తెలిపారు. నది గర్భంలోని మట్టి పనులను పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొం దించు కుంటు న్నట్టు ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల ఒప్పందం లో భాగంగా వచ్చే ఏడాది చివరినాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి వివరించారు.