రైతులు విద్యుత్ సమస్యతో ఇబ్బందులు..

– పంట పొలాలు ఎండిపోతున్నా యి అంటూ ఆందోళన..
– పట్టించుకోని అధికారులు..
నవతెలంగాణ-  కోదాడరూరల్
మండల పరిధిలోని రామలక్ష్మీపురం గ్రామంలో రైతులు విద్యుత్ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో రైతులు బోర్లు బావుల కింద వరి పంట వేశారు. విద్యుత్ సమస్యతో విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయి అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ 24 గంటలు ఇస్తేనే బోరు పోస్తేనే నీరు సరిపోతుంది అని రైతులు తెలుపుతున్నారు. ఒకరోజులో రెండు గంటలు ఇస్తున్నారు అని మరల విద్యుత్ ఆఫ్ అవుతుంది అని, అసలు ఎప్పుడు ఇస్తున్నారో ఇవ్వరో తెలియని పరిస్థితి నెలకొన్నది అని గ్రామస్తులు వాపోతున్నారు లైన్మెన్ కి ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన గ్రామంలో వరి పంట ఎండిపోతుంది అని తెలుపుతున్నారు. వర్షాలు లేక ఎడమ కాలువ కింద వేసిన పంటలు దాదాపుగా ఎండిపోతున్నాయి అని బోర్లు బావుల కింద వేసిన పంటలు అయినా కాపాడుకుందాం అంటే విద్యుత్ సమస్యతో అవి కూడా చేతికి పంట అందే పరిస్థితి లేదని తెలుపుతున్నారు. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఐ లోడ్ ట్రాన్స్ఫార్మర్లను మార్చి రైతులను వరి పంటను కాపాడాలి అని రామలక్ష్మి పురం గ్రామస్తులు కోరుకుంటున్నారు.
రెండు రోజుల్లో విద్యుత్ సమస్య పరిష్కరిస్తా: విద్యుత్ ఏఈ శ్రీనివాస్
రైతులు పడుతున్న సమస్య నా దృష్టికి వచ్చింది, రైతులు గతంలో కన్నా ఎక్కువ మోటార్లను ఉపయోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం పెరిగి ఎక్కువ లోడ్ పడడంతో ట్రాన్స్ఫార్మర్లను మార్చాలి. దీనికి ఖర్చు ఎక్కువవుతుంది అని తెలిపారు. త్వరితగతిన అంటే రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాము అని తెలిపారు.

Spread the love