#WATCH | West Bengal CM Mamata Banerjee slipped and fell while taking a seat after boarding her helicopter in Durgapur, Paschim Bardhaman today. She reportedly suffered a minor injury and was helped by her security personnel. She continued with her onward travel to Asansol. pic.twitter.com/UCt3dBmpTQ
— ANI (@ANI) April 27, 2024
నవతెలంగాణ – పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. హెలికాప్టర్ సీటులో కూర్చోబోయి కిందపడ్డారు. ఈ ఘటన పశ్చిమ్ బర్దమాన్ జిల్లాలోని దుర్గాపూర్ వద్ద జరిగింది. హెలికాప్టర్లోకి ప్రవేశించిన తర్వాత సీటులో కూర్చోబోయే క్షణంలో మమతా బెనర్జీ తుళ్లిపడ్డారు. ఆమెకు స్వల్పస్థాయిలో గాయాలు అయ్యాయి. సెక్యూర్టీ సిబ్బంది ఆమెను వెంటనే పైకి లేపారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు ఆమె అసన్సోల్ బయలుదేరి వెళ్లారు.
]]>]]>
నవతెలంగాణ – హైదరాబాద్: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కనుమరుగైందని, తదుపరి విడతల్లో మరింత దిగజారుతుందని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం బీజేపీ బలహీనంగా ఉందని ఆరోపించారు. మొదటి, రెండు దశల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైందని తెలిపారు. బీజేపీ ఓటర్లను పొందడంలో విఫలమైందని స్పష్టం చేశారు. ఇండియా కూటమి బలంగా ఉందని తెలిపారు. బీజేపీని విడిపించుకునేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని వెల్లడించారు. ద్రవ్యోల్భనం, నిరుద్యోగం ఈ రెండు అంశాలే బీజేపీపై ప్రభావం చూపుతాయని తెలిపారు. బీజేపీకి పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుందని వివరించారు.
]]>నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఇప్పటికే ఫేస్బుక్ పేజీ కలిగి ఉన్న ఆయన ఇప్పుడు ‘ఎక్స్’ (ట్విటర్) లోకి ఎంట్రీ ఇచ్చారు. @KCRBRSpresident పేరిట కేసీఆర్ తన ట్విటర్ ఖాతా తెరిచారు. మాజీ మంత్రి, తన తనయుడు కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇద్దరి అకౌంట్లను మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు. ఇక కేసీఆర్ ఎక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఖాతాను అనుసరించడం చేస్తున్నాయి. అటు ఇన్స్టాగ్రాంలో కూడా కేసీఆర్ తన ఖాతాను తెరిచారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి.. నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఎక్స్ ఖాతాలో కేసీఆర్ ఎప్పటికప్పుడు పంచుకోనున్నారు. ఇక కేసీఆర్ ఎలాంటి విషయాలను ఎక్స్ ద్వారా పంచుకోబోతారనే దాని కోసం నెటిజన్లు, రాజకీయ వర్గాలు, ఇతరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
]]>నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, ఆల్ఫాబెట్ లకు సీఈవోగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్ తాను సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2004లో గూగుల్ లో ప్రోడక్ట్ మేనేజర్ గా చేరినప్పటి నుంచి తన ప్రస్థానాన్ని ఓసారి నెమరువేసుకున్నారు. ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచి ఇప్పటివరకు తన 20 ఏళ్ల సర్వీసులో సంస్థలో ఎన్నో మార్పులు జరిగాయని చెప్పారు. ఈ మేరకు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకున్నారు. “2004 ఏప్రిల్ 26.. గూగుల్ లో నా తొలి రోజు. నాటి నుంచి ఎంతో మారింది. సాంకేతికత, మా ఉత్పత్తులు ఉపయోగించే ప్రజల సంఖ్య, నా జుట్టు.. ఇలా ఎన్నో మారాయి. కానీ ఈ గొప్ప కంపెనీలో పని చేస్తుంటే నాకు కలిగే ఉత్సాహం మాత్రం మారలేదు. 20 ఏళ్లు గడిచిపోయాయి.. నన్ను నేను ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నా” అని సుందర్ పిచాయ్ తన ఇన్ స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు. 20 అంకె ఆకారంలో ఉన్న రెండు బెలూన్లు, లావా విరజిమ్ముతున్నట్లుగా దీపం ఆకారంలోని జ్ఞాపిక, తన తొలి, ప్రస్తుత ఐడీ కార్డుల ఫొటోలను తన పోస్టుకు జత చేశారు.
]]>
నవతెలంగాణ – హైదరాబాద్: ‘తమ పార్టీ పుట్టుక సంచలనం… దారి పొడవునా రాజీలేని రణం’ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ శ్రేణులకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న స్వీయ రాజకీయ పార్టీ అన్నారు. దీని ప్రస్థానం అనితర సాధ్యమని తెలిపారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ ఇది అన్నారు. ఈ నేల మేలు కోరేది బీఆర్ఎస్ అని తెలిపారు. చావు నోట్లో తల పెట్టి రాష్ట్రాన్ని సాధించిన తీరును, లాఠీ దెబ్బలకు భయపడకుండా ముందుకు సాగిన కార్యకర్తల త్యాగనిరతిని కొనియాడారు. అనునిత్యం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని కేటీఆర్ తెలిపారు.