మైసూర్‌లో ఆఖరి షెడ్యూల్‌.

రామ్‌, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. చిత్రబందం మంగళవారం మైసూర్‌లో చివరి షెడ్యూల్‌ను ప్రారంభించింది.
ఈ నెల 15 వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌లో ఓ ఇంటెన్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తోపాటు ఓ పాటను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌తో ఒక్క పాట మినహా సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. షూటింగ్‌ సందర్భంగా మైసూర్‌ ఎయిర్‌పోర్ట్‌లోదిగిన రామ్‌, శ్రీలీల క్యాండీడ్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హీరో రామ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌ థండర్‌ రామ్‌ని రగ్డ్‌ లుక్‌తో, మాస్‌ క్యారెక్టర్‌లో ప్రెజెంట్‌ చేసింది. ఫస్ట్‌ థండర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది.రామ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో సర్వత్రా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుందనే దీమాని మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌ పై అత్యున్నతమైన సాంకేతిక నిర్మాణ విలువలతో, భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. జీ స్టూడియోస్‌ సౌత్‌, పవన్‌ కుమార్‌ సమర్పిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్‌, డివోపీ: సంతోష్‌ డిటాకే, ఎడిటింగ్‌: తమ్మిరాజు.

Spread the love