కివీస్ హాస్ట‌ల్‌లో అగ్నిప్ర‌మాదం…ఆరుగురు మృతి

నవతెలంగాణ – వెల్లింగ్ట‌న్: న్యూజిలాండ్‌లోని నాలుగు అంత‌స్థుల భ‌వ‌నంలో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో ఆరుగురు మృతిచెందారు. ఈ ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. మ‌రో 11 మంది మిస్సింగ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వెల్లింగ్ట‌న్‌ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న దారుణ‌మ‌ని, ఇది విషాదాన్ని నింపిన‌ట్లు ప్ర‌ధాని క్రిస్ హిప్కిన్స్ తెలిపారు. హాస్ట‌ల్‌లో 92 రూమ్‌లు ఉన్నాయి. నిర్మాణ రంగం, హాస్పిట‌ల్ స్టాఫ్‌, ఇత‌ర రంగాల‌కు చెందిన వ్య‌క్తులు కూడా ఆ హాస్ట‌ల్‌లో బ‌స చేస్తున్నారు. అగ్నిప్ర‌మాదం వ‌ల్ల త‌మ వ‌స్తువుల‌న్నీ కోల్పోయిన‌ట్లు కొంద‌రు చెప్పారు. హాస్ట‌ల్‌లో 52 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై అనుమానాలు ఉన్న‌ట్లు ఫైర్ అండ్ ఎమ‌ర్జెన్సీ అధికారులు చెబుతున్నారు.

Spread the love