మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత

నవతెలంగాణ – అమరావతి; మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. 99 ఏళ్ల వృద్ధుడైన సత్యనారాయణ అనారోగ్య కారణాలతో మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు. గతంలో మాడుగుల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో సత్యనారాయణ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.

Spread the love