ఆద్యంతం వినోదభరితం

డాక్టర్‌ బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. ఈ చిత్రంలో ‘బలగం’ ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి, అంజి వల్గమాన్‌, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు.
రమేష్‌ చెప్పాల రచన-దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో, నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, సిబిఐ మాజీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, సీనియర్‌ నేత అద్దంకి దయాకర్‌ నటించడం సినిమా మీద ఆసక్తి రేకిస్తోంది.
ఇటీవల ఈ చిత్ర ప్రివ్యూ షో చూసిన సినీ ప్రముఖులు, ఐదుగురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు సినిమా ఆద్యంతం ఆకట్టుకుం
టుందని, రచయిత, దర్శకుడు రమేష్‌ చెప్పాల సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ‘ఇదొక ఆర్గానిక్‌ గ్రామీణ చిత్రం. రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించే చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్‌ అయ్యింది. ఆ హాట్‌ టాపిక్‌ ఆధారంగా ఈ సినిమాను నియో రియలిజం జోనర్లో చిత్రీకరించారు. ఈ జానర్లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం మాదే కావడం విశేషం. ఈ సినిమా కంటెంట్‌ నచ్చి మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ రిలీజ్‌ చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ సినిమాను ఈనెల 23న రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు’ అని దర్శకుడు తెలిపారు.

Spread the love