నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నేరేడుమెట్లో సామూహిక లైంగికదాడి తీవ్ర సంచలనం సృష్టించింది. కాచిగూడ బాలికపై ఐదుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. బాలికను ట్రాప్ చేసి యువకులు నేరేడుమెట్ తీసుకెళ్లారు. బాలికకు గంజాయి తాగించి యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. లైంగికదాడి విషయాన్ని తల్లికి బాధితురాలు చెప్పింది. కాచిగూడ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. నేరేడుమెట్ పీఎస్కు కేసును పోలీసులు బదిలీ చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.