గ్యాంగ్ వార్.. వ్యక్తులను కార్లతో తొక్కించి హింసాత్మకంగా..

నవతెలంగాణ-హైదరాబాద్ : రెండు వర్గాల మధ్య గ్యాంగ్‌ వార్‌ జరిగింది. కార్లను వేగంగా నడిపి, వ్యక్తులను తొక్కించి హింసాత్మక ఘర్షణకు పాల్పడ్డారు. కార్ల నుంచి కిందకు దిగి దాడులు చేసుకుని బీభత్సం సృష్టించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.  ఈ నెల 18న కుంజిబెట్టులోని ఉడిపి-మణిపాల్ జాతీయ రహదారిపై ఒక గ్యాంగ్‌లోని రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తర్వాత కొంత మంది వ్యక్తులు కార్ల నుంచి బయటకు వచ్చారు. ప్రత్యర్థి ముఠా సభ్యులపై దాడులు చేశారు. ఈ ఘర్షణ సందర్భంగా రివర్స్‌లో వేగంగా వచ్చిన కారుతో ఒక వ్యక్తిని తొక్కారు. అలాగే మరికొందరిని కారుతో ఢీకొట్టారు. కాగా, కార్లతో బీభత్సం సృష్టించిన ఈ ఘర్షణపై పోలీసులు స్పందించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒక స్విఫ్ట్ కారు, రెండు ద్విచక్ర వాహనాలు, కత్తులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితులను తర్వలో పట్టుకుంటామని పోలీస్‌ అధికారి తెలిపారు. మరోవైపు కార్లతో ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Spread the love