ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్

నవతెలంగాణ – హైదరాబాద్: ఎయిర్‌టెల్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 2 ప్లాన్ల ధరలను తగ్గించింది. రూ.499గా ఉన్న రీఛార్జ్‌పై రూ.30 తగ్గించి రూ.469 చేసింది. దీని వ్యాలిడిటీ 84 రోజులు కాగా.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. రూ.1,959తో ఉన్న ప్లాన్ ధరను రూ.1,849కి మార్చింది. 365 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. కాగా, వాయిస్, ఎస్ఎంఎస్‌ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలని ట్రాయ్ ఆదేశించింది.
Spread the love