ఈనెల 31న ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్: మంత్రి పొన్నం

నవతెలంగాణ – హైదరాబాద్: ఈనెల 31న ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీలో 3వేల కొత్త నియామకాలకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. దీనిపై సీఎం రేవంత్ సమక్షంలో స్పెషల్ మీటింగ్ జరుగుతుందని వెల్లడించారు. అలాగే కొత్తగా 3వేల బస్సులు కొనుగోలు చేయనున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఒక్కో జిల్లాలో ఏడు ప్రాంతాలలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని డబుల్‌ బెడ్‌రూమ్‌లు కేటాయిస్తామన్నారు. జిల్లా అధివృద్ధిలో ప్రభుత్వం, అధికారులు కలిసి పని చేయాల్సి ఉందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో ఫిష్‌ మార్కెట్లు కొత్తగా నిర్మించే ఆలోచన ఉందని వివరించారు. అవసరం అయితే ప్రతీ మండలంలో ఒక ఫిష్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు పెరిగిన డైట్‌ ఛార్జీలు అమలు చేస్తామన్నారు.

Spread the love