ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం

నవతెలంగాణ హైదరాబాద్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించడంతో నల్లగొండ, వరంగల్, ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వీరితో పాటు స్వాతంత్ర్య అభ్యర్థిగా అశోక్ కుమార్ ఉన్నారు. దీంతో ఉప ఎన్నిక మొత్తం ఈ నలుగురు అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లు‌గా సాగనుంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఈ రోజు(25 శనివారం) 3.30 గంటలకు ప్రచారం ముగిసింది. ఈ ఉప ఎన్నికల ఈ నెల 27న సోమవారం జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు జూన్ 5న వెలువడనున్నాయి.

Spread the love