మూడు మిల్లులున్న.. ధాన్యం తీసుకోవడం లేదు

– రాజీవ్ రహాదారిపై ధాన్యం బస్తాలతో తోటపల్లి రైతుల బైటాయింపు
– ఎస్ఐ ప్రవీణ్ రాజు సూచనతో నిరసనను విరమించిన రైతులు
నవతెలంగాణ- బెజ్జంకి
గ్రామ శివారులో మూడు రైస్ మిల్లులున్న..స్థానిక రైతుల వరిధాన్యాన్ని తీసుకోవడం లేదని.. రైస్ మిల్లుల యాజమానుల తీరును నిరసిస్తూ సోమవారం మండల పరిధిలోని తోటపల్లి గ్రామ రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రాల నిబంధనలను పాటిస్తూ ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్న కొతలు విదిస్తూ యాజమానులు దోపిడి చేస్తున్నారని రైతులు తమ వరిధాన్యం బస్తాలతో తోటపల్లి స్జేజ్ రాజీవ్ రహదారిపై బైటాయించి నిరసన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ ప్రవీణ్ రాజు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు.సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువేళ్తామని ఎస్ఐ ప్రవీణ్ రాజు సూచించడంతో రైతులు నిరసనను విరమించారు. తోటపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.

Spread the love