నవతెలంగాణ – ముధోల్
ముధోల్ హిందు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ను ఎస్పీ కార్యాలయంలో కలిసి ఘనంగాసన్మానించారు. ముధోల్ గణేష్ నిమజ్జనంకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి,ప్రశాంతంగా నిర్వహించినందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే భైంసా ఎఎస్పీ అవినాష్ కుమార్, భైంసా టౌన్ సిఐ రాజారేడ్డిని కలిసి ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. బందోబస్తులో పాలు పంచుకున్న పోలిసులకు ఈసందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా పోలిసులకు సహకరించిన ఉత్సవకమిటీ అధ్యక్షుడు రోల్ల రమెష్ ను, సభ్యులను, గణేష్ మండలి నిర్వాహకులను ఈసందర్భంగా ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు అభినందించారు.ఈకార్యక్రమంలో ముధోల్ హిందు ఉత్సవ కమిటి అధ్యక్షులు రోళ్ళ రమేశ్ గౌరవ అధ్యక్షులు ధర్మపురి సుదర్శన్,విడీసీ అధ్యక్షులు గుంజల నారాయణ , కోశాధికారి మేత్రి సాయినాథ్ , ఉపాధ్యక్షులు వరగంటి జీవన్ , తాటివార్ రమేశ్ ,కోరి పోతన్న ,సంయుక్త కార్యదర్శులు దేవోజీ భూమేష్ , పెద్దకర్రోళ్ల మోహన్ ,కార్యవర్గ సభ్యులు జంబూల సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.