IPL : ముంబైకి భారీ టార్గెట్ ఇచ్చిన గుజరాత్

నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబైతో జరుగుతున్న ఎలిమినేటర్ 2లో గుజరాత్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణిత 20 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 234 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. గుజరాత్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ శుభమన్ గిల్ (129) సెంచరీ చేయగా సాయి సుదర్శన్ (43),  చివర్లో వచ్చిన పాండ్యా 28 పరుగులు చేయడంతో భారీ స్కోరును నమోదు చేసింది.

Spread the love