గురివింద సూక్తి ముక్తావళి!

ఎదుటివారి నలుపు గురించి గురివిందలు మాట్లాడటం ఆశ్చర్యమే! అదీ తల్లి గొబ్బెమ్మలాంటి పెద్ద గురివింద నీతులు చెప్పడం ఒకింత అసహ్యం కూడా కలుగుతోంది. తన ‘శుద్ధపూసత్వా’ న్ని వెలుగులోకి తేవడానికి, నిలువునా నిలబెట్టడానికి ఇతర పార్టీలన్నింటినీ అవినీతిపరమైనవన్న వాఖ్యానం, చేస్తున్న ఆర్భాటం ‘భక్తుల’ కెలావున్నా మిగిలిన దేశ ప్రజలకు జుగుప్స కలిగిస్తున్నాయి. అన్ని పత్రికల్లో, లేదా చాలా పత్రికల్లో బీజేపీ అస్మదీయులు దిగబడి ఉన్నారు. మోడీ మీద వాలే ‘ఈగల్ని’ తోలడం వారి తక్షణ కర్తవ్యం. ఇది మరీ ‘నాటు’గా ఉంటే, మోడీపై ఈగలు వాలకుండా చూడటం వారి వృత్తి ధర్మం! ఢిల్లీ వీధుల్లో పోయే తెలుగువారి పరువు గురించీ, అది మోరీల్లో కలుస్తున్న తీరు గురించీ ఒక ‘సత్య’వంతుడు తెగ బాధపడ్డాడు. బీఆర్‌ఎస్‌ నేతలు ఈడీ, సిబిఐల దెబ్బకి భయపడి కోట్ల రూకలు ప్రచారంపై ఖర్చు చేశారని ‘బాధ’పడ్డాడు. అవినీతి సామ్రాట్టుల భరతం పట్టేందుకే ఈడీ, సిబిఐలున్నాయట! ”నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు!” అంటే ఇదే కదా! మీపై కాలుదువ్వినవారిని ఒకరకంగాను, మీకు లొంగిపోయిన వారిపై మరొక రకంగా పైరెండు సంస్థల్నీ వినియోగించడం దేశం గమనిస్తూనే ఉంది కమలనాథులారా! 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణమో, ‘కోల్‌’గేట్‌ కుంభకోణం గురించో మోడీ పదే పదే చెపుతూ ఉంటారు. ఇలాంటి కుంభకోణాలు వ్యక్తులకో, పార్టీలకో సంబంధించినవి కావు

 

 

 

 

 

Spread the love