సిద్దిపేటలో నామినేషన్‌ దాఖలు చేసిన హరీశ్‌ రావు

నవతెలంగాణ – సిద్దిపేట: మంత్రి హరీశ్‌ రావు సిద్దిపేటలో నామినేషన్‌ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. నామినేషన్‌ దాఖలు ముందు సిద్దిపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హరీశ్‌ రావు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం పట్టణంలో ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆర్వో కార్యాలయానికి బయల్దేరారు.

Spread the love