మామా అల్లుళ్లు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పి. సముద్రఖని దర్శకుడు. దీనికి దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పవన్కళ్యాణ్ ఫస్ట్ లుక్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ‘బ్రో ద్వయం’ పేరుతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఉన్న పోస్టర్ని మేకర్స్ సోమవారం విడుదల చేశారు. పోస్టర్లోని ఎట్మాస్పియర్ చూస్తే, వాడికి నేనున్నాను.. అనేలా పవర్స్టార్ తీరు ఉంటే, ఆయన తీరుకి తగ్గట్టే సాయిధరమ్తేజ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి.
ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. జులై 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.