నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి మండలంలోని వివిధ గ్రామాల్లో వరి మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. అలాగే ఈదురు గాలులకు నివాస గుడిసెలు, రేకుల షెడ్లు లేచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వివిధ గ్రామాల ప్రజలు అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
![](https://navatelangana.com/wp-content/uploads/2024/05/IMG-20240512-WA0286.jpg)