నవతెలంగాణ-హైదరాబాద్ : హీరో సిద్దార్థ్ పెండ్లి పీటలెక్కాడు. తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరి మెడలో మూడుముళ్లు వేశాడు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం టెంపుల్ ఈ పెండ్లికి వేదికగా మారింది.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలో బుధవారం (మార్చి 27న) ఈ వివాహం జరిగింది. తమిళనాడు పురోహితులు దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించడం విశేషం. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షల మధ్య సిద్దార్థ్- అదితి పెళ్లి జరిగింది.
అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం(2021) మూవీలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఇద్దరూ వెకేషన్కు, ఈవెంట్స్కు కలిసే వెళ్తున్నారు. టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్, పెండ్లికి సైతం జంటగా హాజరవడంతో వీరి ప్రేమ నిజమేనని అభిమానులు భావించారు. ఓ షోలో మీతో జీవితాంతం కలిసి డ్యాన్స్ చేయాలనుకునే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అని సిద్దార్థ్కు ప్రశ్న ఎదురవగా.. ‘అదితి’ దేవో భవ అంటూ తన ప్రేమ గురించి చెప్పకనే చెప్పాడు. కానీ డైరెక్ట్గా తన ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడని సిద్దార్థ్.. ఇప్పుడేకంగా సీక్రెట్గా పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.