గ్రూప్ 3, 4 పరీక్షలపై స్టేకు హైకోర్టు నిరాకరణ

నవతెలంగాణ – హైదరాబాద్‌: గ్రూప్ 3, 4 పరీక్షలపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్ 3, 4లో టైపిస్ట్‌ కమ్ అసిస్టెంట్ పోస్టులు తొలగించారని హైకోర్టులో 101 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఇరువార్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఉద్యోగ నియామక ప్రక్రియను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 13కి వాయిదా పడింది.

Spread the love