సీఎం కేజ్రీవాల్‌పై స్పందించిన ఆయన భార్య సునీతా కేజ్రీవాల్

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు గతరాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. దీనిపై కేజ్రీవాల్ అర్ధాంగి సునీతా కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. ఆమె ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ”మోడీ గారూ… మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని మీరు అధికార అహంకారంతో అరెస్ట్ చేశారు“ అని మండిపడ్డారు.  “మోడీ ప్రతి ఒక్కరినీ అణచివేయాలని చూస్తున్నారు. సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం ద్వారా ఢిల్లీ ప్రజలకు ద్రోహం తలపెట్టారు. ఢిల్లీ ప్రజలారా… మీ ముఖ్యమంత్రి ఎప్పుడూ మీ పక్షానే ఉంటారు. ఆయన బయట ఉన్నా, జైల్లో ఉన్నా ఆయన జీవితం ఎప్పుడూ దేశానికే అంకితం. ఆయన జనార్దనుడు (విష్ణువు, పరోపకారి) అని ప్రజలందరికీ తెలుసు” అని అని స్పష్టం చేశారు.

Spread the love