– పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలో పలు వార్డులలో అభివృద్ధి కార్యక్రమాల పనులకు శంకుస్థాపన ,కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజవర్గం లో ఒక బిందె నీళ్లకు బయటకు వచ్చి నిరసనలు ఉండకూడదని, గత సంవత్సరం కూడా ముందే మంచినీటి సమస్య లేకుండా ప్లాన్ చేశామన్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. ముంపు బాధితుల సమస్యలు తెలుసని మేము లోయర్ మనేర్ డాం నిర్వసితులేం విలువైన భూమిని అప్పుడు రూ.1800 లకి ఎకరం ఇచ్చామన్నారు. సమస్యలు ఏమున్నా మార్చ్ తరువాత అన్ని పరిష్కారం చేస్తాం ఆధి నా బాధ్యత అన్నారు. పట్టణంలో 20 వార్డుల్లో రోడ్లు , మురికి కాలువల నిర్మాణానికి రూ.50 లక్షలు చొప్పున ఇస్తున్నామన్నారు. పది మహిళ సంఘాలకు రూ 45 లక్షల చొప్పున ఇచ్చామన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ అభివృద్ధికి శంఖు స్థాపన చేసుకున్నామని చెప్పారు. మహిళలకు ఆర్థిక వృద్ధి సాధించడానికి కొన్ని ఇంట్లో కూర్చొని చేసే పనులు ఉన్నాయన్నారు. సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి ఆసక్తి ఉన్నవారు శిక్షణ తీసుకోవలన్నారు..మెప్మా ద్వారా మీకు ఏ పథకాలు ఉన్నాయనేది చూస్తారన్నారు. ఆర్థికంగా వెసులుబాటు ఉండే కార్యక్రమాలు చేపడతమన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆర్డీవో రామ్మూర్తి, తహసిల్దార్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.