నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ సీపీ శ్రీనివాస్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సైల నుంచి హోంగార్డుల వరకు అందర్నీ బదిలీ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 85 మందిని బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.