ఏపీలో మరోసారి వైసీపీదే అధికారం : ఆరామస్తాన్ సర్వే

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారం చేపట్టనుందని ఆరామస్తాన్ సర్వే చెబుతోంది. జగన్ పార్టీకి 94-104 స్థానాలు రావచ్చని ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వెల్లడించింది. టీడీపీ+జనసేన+బీజేపీ కూటమి 71-81 సీట్లతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావచ్చని పేర్కొంది. సంక్షేమ పథకాలతో జగన్కు ఓటర్లు తిరిగి పట్టం కట్టినట్లు ఈ సర్వే పేర్కొంది. తెలుగుదేశం పార్టీ కీలక నేత నారా లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి గెలుస్తారని ఆరా మస్తాన్ తన సర్వే ఫలితం వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి, నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తారని వెల్లడించారు.

Spread the love