WTC ఫైనల్ : 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియన్ ను 469 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన ఇండియాకు ఆరంభం సరిగానే ఉన్నా ఆ స్టార్ట్ ను వాడుకోవడంలో ఓపెనర్లు ఫెయిల్ అయ్యారని చెప్పాలి.. మొదటగా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 15 పరుగులకే కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ కాగా, ఆ తర్వాత ఫామ్ లో ఉన్న శుబ్ మాన్ గిల్ సైతం బొలాండ్ బౌలింగ్ లో 13 పరుగులకే పెవిలియన్ చేరాడు.50 పరుగుల వద్ద పూజారా (14) గ్రీన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్. క్రీజులో కోహ్లీ (6) పరుగులతో ఉన్నాడు.

Spread the love