నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభాహొరంజన్ హీరోలుగా, సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి,హొపెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన బహుభాషా చిత్రం ‘భారతీయన్స్’. భారత్ అమెరికన్హొక్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. రచయిత దీన్ రాజ్ ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవు తున్నారు. ఈ చిత్రాన్ని మాజీ సైనికాధికారుల కోసం ప్రసాద్ ల్యాబ్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. చైనా నీచ బుద్ధిని ఎండగడుతూ రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. నిర్మాత డాక్టర్ శంకర్ నాయుడు మాట్లాడుతూ, ‘మన సైనికుల ప్రాణాలు బలి తీసుకుంటూ, మన దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించే నీచ చర్యలకు పాల్పుతున్న చైనా పేరును తొలగించమని సెన్సార్ సభ్యులు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళడానికయినా సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. ‘త్రివిధ దళాల్లో పనిచేసిన మన దేశ ముద్దుబిడ్డలైన సైనికాధికారులు మా చిత్రాన్ని చూసి మెచ్చుకోవడం ఎంతో గర్వంగా ఉంది’ అని దర్శకుడు దీన్ రాజ్ చెప్పారు.