– విధివిధానాలు రూపొందించండి
– పీఎంఏవై నుంచి గరిష్టంగా ఇండ్లు సాధించాలి
– రాజీవ్ స్వగృహ ఇండ్లకు వేలం
– సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. గ్రామ, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు విధి, విధానాలను ఒకట్రెండు రోజుల్లో రూపొందించాలని సూచించారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు దక్కాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించు కుంటే ఈ విషయంలో తెలంగాణ వెనుకబడి ఉందని తెలిపారు. ఈ దఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గరిష్ట సంఖ్యలో రాష్ట్రానికి ఇండ్లు సాధించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలని సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారం వెంటనే ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజినీరింగ్ సిబ్బందికి సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులు వివరించారు. అవసరమైతే ఔట్సోర్సింగ్ పద్ధతి ప్రకారం నియామకాలు చేపట్టాలని అన్నారు. రాజీవ్ స్వగృహలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లు, ఇండ్లు వేలం వేయాలని సూచించారు. ఏండ్ల తరబడి వథాగా ఉంచడం సరికాదనీ, వెంటనే వేలానికి రంగం సిద్ధం చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తయినా వాటిని ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. అర్హులకు ఆ ఇండ్లను అప్పగించా లన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లకు మౌలిక వసతులు కల్పించి, వాటికి అర్హులైన లబ్దిదారులకు అప్పగించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్, తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీపీి.గౌతమ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.