నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడ ఫామ్హౌస్కు ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు. అక్కడ కొలతలు వేస్తూ పరిశీలిస్తున్నారు. కాగా, చెరువు FTLలో దాన్ని నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫామ్హౌస్ తనది కాదని, లీజుకు తీసుకున్నానని కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా అధికారులు అక్కడికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.