కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు

– కౌలు రైతుల భరోసా ఏది..
– ఎండిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి కేటీఆర్…
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువెనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను గురువారం మాజీ మంత్రి కెటిఆర్ పరిశీలించారు. కౌలు రైతులతో పంట పొలాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచిన రూ.2లక్షల రుణమాఫీ ముచ్చట ఇప్పటివరకు ప్రస్తావించలేదన్నారు. చేస్తానన్న రుణమాఫీ చేయలేదు కదా..  బ్యాంకుల ద్వారా నోటీసులు ఇప్పిస్తూ…మెడపైన కత్తి పెట్టి రుణాలు కడతారా.. చస్తారా.. అన్నట్లు  కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఉందని ఎద్దేవా చేశారు. రైతు భరోసాను కేసీఆర్ రూ.10వేలు ఇస్తానంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.15వేలు ఇస్తానని చెప్పి..అది కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు.రైతుల కోసం రైతు బందు కోసమని కెసిఆర్ ప్రభుత్వం రూ.7వేల కోట్ల ఖజానా ఉంచిపోతే.. కాంట్రాక్టర్ల కోసం, కాంట్రాక్టర్ల ఖజానా నింపడం కోసం  రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరతీసిందన్నారు.ఎండిన పోయిన పది పదిహేను లక్షలు ఎకరాలను రాష్ట్రవ్యాప్తంగా మా ఎమ్మెల్యేలతో పరిశీలుస్తున్నామన్నారు.రైతులను చూస్తే నిజంగానే బాదేస్తుందన్నారు.మేడిగడ్డ వద్ద కుంగిపోను మూడు పిల్లర్ల వద్ద కాపర్ డామ్ కడితె అయిపోయేది. దాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.ఢిల్లీకి జాతరలు,యాత్రలు తప్పితే రాష్ట్రానికి రేవంత్ చేసిందేమీ లేదన్నారు.కౌలు రైతులు, రైతులకు చేస్తానన్న లబ్ది చేకూర్చాలని డిమాండ్ చేశారు.రైతులకు ఇస్తానన్న క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.రైతులు ధైర్యంగా ఉండండి మేం ఉన్నాం.రైతులు ఆత్మహత్యలు లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని రైతులను కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాన రూ.25వేలు వెంటనే అందించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

Spread the love