జగన్ కాన్వాయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం..!

నవతెలంగాణ – అమరావతి: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా కడప జిల్లాలోని తన సొంత నియోజకర్గం అయిన పులివెందులకు బయలు దేరిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్తుండగా జరిగింది. కడప జిల్లాలోని నరసరామ్ పల్లి సమీపంలో జగన్ చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ప్రజల కోసం అకస్మికంగా జగన్ కాన్వాయ్ ఆగింది. ఈ క్రమంలోనే కాన్వాయ్ లో ఉన్న ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రైవేట్ వాహనం ఢీ కొట్టింది. దీంతో పెద్ద ప్రమాదమే జరిగిందని అందరూ భావించారు. అక్కడ ఊహించనంత ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత తిరిగి మళ్లీ పులివెందులకు బయలు దేరారు. కొంత మంది ప్రజలతో కూడా కొద్ది సేపు మాట్లాడారు.

Spread the love