నవతెలంగాణ – హైదరాబాద్: ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్-2025ను మే 18వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటీ కాన్పుర్ సోమవారం వెల్లడించింది. జేఈఈ మెయిన్లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం 17,695 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) సీట్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం (2025-26)లో మరికొన్ని సీట్లు పెరిగే అవకాశముంది.