నవతెలంగాణ -హైదరాబాద్: వరంగల్, జనగామ, భువనగిరి నుంచి మహారాష్ట్రలోని పుణెకు మరో రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. పుణె (హడప్సర్)-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ను కాజీపేట వరకు పొడిగించడంతో మరికొన్ని జిల్లాల ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రైలు నాంపల్లి స్టేషన్కు బదులుగా సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుందని ద.మ.రైల్వే ఆదివారం ప్రకటించింది. ఈ మార్పులు 9 నుంచే అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పును గుర్తించాలని ద.మ.రైల్వే సూచించింది. టెర్మినల్ మార్పు సమాచారాన్ని ప్రయాణికుల మొబైల్ నంబర్లకు పంపించనున్నట్లు తెలిపింది. కాజీపేట-పుణె (నెం.17014/17013) ఎక్స్ప్రెస్ వారంలో మూడురోజులు మంగళ, శుక్ర, ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.