ఉద్యోగులకు దీపావళి బోనస్‌పై కేజ్రీవాల్ శుభవార్త..

నవతెవలంగాణ – ఢిల్లీ: దీపావళి పండుగ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త చెప్పారు. నాన్-గెజిటెడ్ గ్రూప్ బీ, గ్రూప్ సి ఉద్యోగులకు ఒక్కొక్కిరికి రూ.7 వేల చొప్పున దీపావళి బోనస్ ప్రకటించారు. ఇందుకోసం ఏకంగా రూ.56 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. దీని వల్ల 80 వేల మంది ఉద్యోగులు లబ్ది పొందుతారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘ఢిల్లీ ప్రభుత్వంలోని నాన్-గెజిటెడ్ గ్రూప్-బి, గ్రూప్ సి ఉద్యోగులకు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి రూ.7 వేలు అందజేస్తాం.. ప్రస్తుతం ఈ కేటగిరీలకు చెందిన దాదాపు 80 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.. ఇందుకోసం రూ.56,000 కోట్లు ఖర్చువుతుంది’ అని ఢిల్లీ సీఎం ఓ ప్రకటన వెలువరించారు.

Spread the love