నవతెలంగాణ హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డితో (Revanth reddy) ఆర్బీఐ మాజీ గవర్నర్ (RBI Ex Governor) రఘురామ్ రాజన్(Raghuram Rajan) భేటీ అయ్యారు. జూబ్లీహిల్లోని రేవంత్రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధికై అనుసరించాల్సిన వ్యూహాలపై రఘురామ్ రాజన్తో వారు చర్చించినట్టు తెలుస్తోంది.