నవతెలంగాణ – ముంబాయి: ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న టీమిండియా తన రెండో వామప్ మ్యాచ్ కోసం తిరువనంతపురం చేరుకుంది. అయితే విరాట్ కోహ్లీ జట్టుతో పాటు అక్కడికి వెళ్లకుండా ముంబై వెళ్లినట్టు వార్తలు రావడంతో ఏం జరిగిందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కోహ్లీ భార్య అనుష్కశర్మ రెండోసారి తల్లికాబోతున్నట్టు వార్తలు రావడం.. అదే సమయంలో కోహ్లీ ముంబై వెళ్లడంతో శుభవార్త చెప్పేందుకే కోహ్లీ ముంబై వెళ్లినట్టు అభిమానులు సోషల్ మీడియా ద్వారా చర్చించుకుంటున్నారు. అంతేకాదు, దంపతులిద్దరూ ముంబైలోని ఓ గైనకాలజీ ఆస్పత్రి వద్ద కనిపించినట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే.. రేపు తిరువనంతపురంలో నెదర్లాండ్స్తో రెండో వామప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. మరో మూడు రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభం అవుతుంది. 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్లో తలపడుతుంది.