గుమ్మడవల్లి,పెద్ద వాగు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కొత్తగూడెం ఆర్డీవో మధు…

గుమ్మడవల్లి,పెద్ద వాగు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కొత్తగూడెం ఆర్డీవో మధు...– ముంపు గృహాలకు నిధులు మంజూరు
నవతెలంగాణ – అశ్వారావుపేట
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు  శనివారం వరద ప్రభావిత ప్రాంతాలైన గుమ్మడవల్లి,పెద్దవాగు పరిసర ప్రాంతాలను కొత్తగూడెం ఆర్డీఓ మధు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన వరదల వల్ల దెబ్బతిన్న గృహాలను,వ్యవసాయ భూముల లో ఇసుక మేటలు ను పరిశీలించి వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా సహాయం అందుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు  44 పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు 21 కచ్చా ఇల్లు  3 మరియు పశువుల కొట్టం లు 42 గుర్తించామని తెలిపారు.పూర్తిగా దెబ్బతిన్న గుడిసెలు కు రూ. 4100 లు,పాక్షికంగా దెబ్బతిన్న పక్కా గృహాలకు రూ. 5200 లు, కచ్చా ఇళ్లకు రూ. 3200 లు,పశువుల కొట్టం లకు రూ.2100 లు ప్రభుత్వ ఆదేశాల మేరకు నష్టపరిహారం కింద  మొత్తం రూ. 3,94,700 రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.పెద వాగు ప్రాజెక్టు వరద బాధితులకు గుమ్మడి వల్లి ప్రభుత్వ పాఠశాలలో పునరావాసం  కల్పించి శుక్రవారం,శనివారాలు  గ్రామపంచాయతీ కార్యాలయంలో వరద బాధితులకు భోజన ఏర్పాటు చేశామని తెలిపారు. గుమ్మడి వల్లి లో ఎన్పీడీసీఎల్ సిబ్బంది ద్వారా విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు.వరద బాధితులకు అందుతున్న  సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు
Spread the love