బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు జ కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో ఇటీవల హత్య చేయబడ్డ బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు.

Spread the love